etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 16, 2019

ఎండాకాలం కదా అని ఏసీ లో ఎక్కువగా ఉంటున్నారా ..! ఈ విషయం తెలిస్తే అస్సలు ఉండరు.

తమిళనాడులో ఘోరం. ఎండాకాలం కదా అని ముచ్చటగా కొనుక్కున్న ఏసీ పేలి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆ సమయంలో గదిలో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై సిటీ టిండివనం కావేరిపక్వం ప్రాంతంలో రాజు (60) కుటుంబం నివాసం ఉంటుంది. 2019, మే 15వ తేదీ రాజు, అతని భార్య కళ, చిన్న కుమారుడు గౌతమ్ ఓ గదిలో ఏసీ వేసుకుని నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్య్కూట్ అయ్యింది. ఆ వెంటనే ఏసీకి మంటలు వ్యాపించాయి. భారీ శబ్ధంతో ఏసీ పేలిపోయింది. వెంటనే మంటలు గది అంతా వ్యాపించాయి. గదిలో నిద్రిస్తున్న రాజు, కళ, గౌతమ్ సజీవ దహనం అయ్యారు.

భారీ శబ్ధం విన్న చుట్టుపక్కల వారితోపాటు మరో గదిలో నిద్రిస్తున్న రాజు పెద్ద కుమారుడు కాపాడటానికి ప్రయత్నించారు. అయితే గది లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో సాధ్యం కాలేదు. ఒక్కసారిగా గది నుంచి భారీ శబ్ధం వినిపించింది.. ఏసీ కండెంసర్ పేలడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని చెబుతున్నారు స్థానికులు. ఏసీ పేలిపోవటం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీకి మంటలు వ్యాపించి.. పేలిందని చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

The post ఎండాకాలం కదా అని ఏసీ లో ఎక్కువగా ఉంటున్నారా ..! ఈ విషయం తెలిస్తే అస్సలు ఉండరు. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2EdjcW0

No comments:

Post a Comment