etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, May 28, 2019

ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆవేశం చూస్తే ఆశ్చర్యపోతారు

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా ఈరోజు విశ్వ విఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ రావు జయంతి అన్న సంగతి మన అందరికి తెలిసిందే..రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి అభిమానులు ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ జన్మ దిన వేడుకల్ని జరుపుకున్నారు..నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కి నివాళులు అర్పించుకున్నారు..అయితే ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన అసహనానికి గురి అయ్యాడు..ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎలాంటి పూలతో అలంకరణ చెయ్యకపోవడం తో జూనియర్ ఎన్టీఆర్ కోపం తెచ్చుకున్నాడు..స్వయంగా ఆయనే పులి తెప్పించి ఎన్టీఆర్ సమాధి పై చల్లారు..ఇక నుండి ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతికి పూల ఎన్టీఆర్ సమాధి వద్ద పూల అలంకరణ చేయించే బాధ్యత నేనే తీసుకుంటాను అని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు..ఎన్టీఆర్ ని ఇంత కోపం గా ఎప్పుడు చూడకపోవడం తో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆవేశం చూస్తే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2MdahKu
via IFTTT

No comments:

Post a Comment