etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 11, 2019

జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న నటుడు అలీ

టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా.. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే… ఆయన వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కాగా పోటీ ఎక్కడ్నుంచి అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

The post జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న నటుడు అలీ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2CgxSCE

No comments:

Post a Comment