సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరనున్నట్టు తెలుస్తుంది.అర్ధరాత్రి ఒంటిగంటకు జనసేన అధినేత పవన్తో లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. దాదాపు వీరిద్దరూ 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పలు అంశాలపై ముప్పావు గంట సేపు మంతనాలు జరిగాయి. ఈ ఉదయం పదిన్నర గంటలకు లక్ష్మీనారాయణ జనసేనలో చేరబోతున్నారు. ఆయన్ను ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారు.. అసెంబ్లీ బరిలో దింపుతారా.. లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇస్తారా అనేది స్పష్టం కాలేదు. పార్టీలోచేరిన తర్వాత జనసేనాని నిర్ణయం తీసుకుంటారని పార్టీ తెలిపింది. లక్ష్మీనారాయణతో పాటు ఆయన తోడల్లుడు, విద్యావేత్త, SKU మాజీ వైస్ చాన్స్లర్ రాజగోపాల్ కూడా జనసేన కండువా కప్పుకోనున్నారు
Ex CBI JD Lakshmi Narayana meeting with JanaSena Chief @PawanKalyan pic.twitter.com/UVlEsYBWJd
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2019
The post బ్రేకింగ్, జనసేనలో చేరనున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!, appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2uea2mS
No comments:
Post a Comment