పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియంతో దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగన్నాన్ని మూడు పూటలా ఆరగిస్తుంటారు. అయితే, రాత్రి పూట పెరుగన్నం తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెపుతారు. రాత్రివేళ పెరుగు తినరాదనే విషయాన్ని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండటమే ఉత్తమం. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు లేనివారు రాత్రివేళ పెరుగుతో అన్నం తినొచ్చు. అయితే పెరుగుతో భోజనం చేసి వెంటనే పడుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పైన చెప్పుకున్నట్లు పెరుగుకు చల్లబర్చే గుణం ఉంది. అంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. భోజనం జీర్ణం అయ్యేప్పుడు వేడి పుడుతుంది. దానిని పెరుగు చల్లబర్చడం వల్ల స్లోగా అరుగుదల నడుస్తుంది. పెరుగుతో అన్నం తినాల్సి వస్తే పడుకోవడానికి కనీసం 2గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
The post రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2KaQ4Eq


No comments:
Post a Comment