నెటిజన్లపై ప్రముఖ నటి రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓటు హక్కు గురించి తనకు నెటిజన్లు ఇచ్చే సలహాలు, సూచనలపై రేణు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు.. తాము ఓటు వేసిన అనంతరం రేణు వాల్పై ఫోటో పెట్టి విసిగించడంతో రేణు స్పందించారు. తన పోస్ట్ను జనహితం కోసం జారీ చేశామని ఆమె పేర్కొన్నారు. నేను పుణెలో ఈ నెల 23న ఓటింగ్లో పాల్గొనబోతున్నాను. ఇక నాకు మెసేజ్లు చేయడం, ఓటింగ్ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో లెక్చర్లు ఇవ్వడం, ఫింగ్ ప్రూఫ్ని పోస్ట్ చేయడం వంటివన్నీ మానండి. ఉదయం నుంచి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి’’ అంటూ రేణు ఫైర్ అయ్యారు.
The post నాకు లెక్చెర్లు ఇవ్వడం ఆపండి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2X6Wvtz
No comments:
Post a Comment