etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 24, 2019

ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో చిరంజీవి ఫోనులో మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా మార్పు కోసం నిజాయితీగా పని చేసిన పవన్ కళ్యాణ్ కి ఇలాంటి ఫలితం రావడం ప్రత్యర్థులు కూడా జీర్ణించుకోలేక ఉన్నారు..ఇక మెగా స్టార్ చిరంజీవి జనసేన పార్టీ పరాజయం గురించి నిన్న పవన్ కళ్యాణ్ తో గంటకి పైగా ఫోన్ కాల్ సంభాషణ జరిపారు అట..ఇందులో అయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది ..అయన మాట్లాడుతూ “నిజాయితీగా ప్రజల కోసం పోరాడాలి అనుకుంటే రాబందులు లాంటి అవినీతి రాజకీయ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అసత్య ప్రచారాలు చేసి మూడవ శక్తిని సమూలంగా తొక్కాలని చూస్తారు..గతం మన ప్రజారాజ్యం పార్టీని ఇలాగె ముంచేశారు..కానీ తమ్ముడు నువ్ ఎంతో నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేసావు.. ఇంత తక్కువ వయసులో విలాసంతమైన జీవితం ని వదులుకొని వచ్చి ఇలాంటి ఫలితం ని ఎదురుకోవడం నేను జీర్ణించుకోలేక ఉన్నాను.. జరిగింది ఎదో జరిగిపోయింది..వెనుక అడుగు వెయ్యకుండా ఇదే చిత్తశుద్ధితో పని చెయ్యి ..రాబొయ్యే 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ ని తిరుగులేని శక్తిగా తయారు చెయ్యి ” అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో సంభాషించారు

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో చిరంజీవి ఫోనులో మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2HTJ4ak
via IFTTT

No comments:

Post a Comment