కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఓటమి గురించి అటు సినీ పరిశ్రమ నుండి మరియు రాజకీయ నాయకుల నుండి తీవ్రమైన బాధ వ్యక్తమవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రత్యర్థుల కూడా పవన్ కళ్యాణ్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు..ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు అయితే తీవ్రమైన దిగ్బ్రాంతికి లోను అయ్యారు..పవన్ కళ్యాణ్ ఓటమి గురించి ఆయన తల్లి అంజనా దేవి గారు మాట్లాడుతూ “నా బిడ్డ ఎంతో నిజాయితీగా పోరాడాడు..అందరిలా కాకుండా ఎంతో కొత్తగా నూతన రాజకీయాలకు తెర లేపాడు..తొలుత పరాజయమే ఎదురు అవ్వచ్చు..కానీ ఎదో ఒక్క రోజు నా బిడ్డ దేశం గర్వించే నాయకుడు అయ్యి తీరుతాడు..ఇలాంటి బిడ్డ నా కడుపునా పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ” అంటూ పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి గారు స్పందించారు..నిన్న ఫేస్ బుక్ లో కూడా రామ్ చరణ్ స్పందించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక పోతే పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణ కోసం ఈ జూన్ 1 నుండి ప్రతి జిల్లా నాయకులతో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో చర్చలు జరపనున్నారు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post జనసేన పార్టీ పరాజయం గురించి పవన్ తల్లి అంజనా దేవి గారు మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JLaKSr
via IFTTT

No comments:
Post a Comment