కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వడం అభిమానులనే కాదు ,ప్రత్యర్థులకు కూడా తీవ్రమైన దిగ్బ్రాంతి కలిగించింది..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం తో రాబొయ్యే రోజుల్లో జనసేన పార్టీ ని తిరుగులేని పార్టీ గా తీర్చి దిద్డేందుకు కంకణం కట్టుకున్నాడు..దాని కోసం ఆయన జూన్ 1 వ తేదీ నుండే కార్యాచరణ ప్రారంభిస్తున్నాడు.. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు అన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి ,నివాళులు అర్పించి ,తర్వాత బాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ ” ఈరోజు మహనీయుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకీ నివాళులు అర్పించడం జరిగింది..తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయన” అంటూ తన తండ్రి గురించి ఎంతో బావోద్వేగంగా మాట్లాడాడు..అంటే కాకుండా ఈ ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీ ఓటమిల గురించి ఒక్క విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ “రాజకీయాలు అన్నాక గెలుపు ,ఓటములు సర్వ సాధారణం..ఈ ఎన్నికలు మేము ఒక్క గుణ పాఠం లా తీసుకొని మా తప్పులు సరిద్దిదుకుందాం..జనసేన పార్టీ గురించి ప్రస్తుతం నేను ఏమి మాట్లాడదల్చుకోలేదు “అంటూ సమాధానము ఇస్తూ వెళ్లిపోయారు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post పవన్ కళ్యాణ్ ఓటమి గురించి పెను దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2WAQ3yB
via IFTTT

No comments:
Post a Comment