కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఓడిపోవడం మెగా ఫామిలీ మొత్తం ని శోక సంద్రం లో ముంచేసింది అనే చెప్పాలి..విలాసవంతమైన జీవితం ని వదులుకొని ప్రజా సేవ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఇలాంటి ఫలితం ఇవ్వడం ని అభిమానులే కాదు ,ప్రత్యర్థులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు..ఈ కాలం లో డబ్బు లేనిదే రాజకీయాయ్లలో నెగ్గుకుని రాలేము అని మరోసారి నిరూపితమైంది..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ చాల కాలం తర్వాత తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి చాల సేపు సమయం ని గడిపారు..సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి ,తమ్ముడు ఇంటికి వచ్చాడు అనే వార్త తెలియగానే హుటాహుటిన ఇంటికి చేరుకొని తమ్ముడు తో సమయం గడిపాడు..దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..చాల కాలం తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసి ఒక్కే చోట కనపడడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post Breaking News: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మెగా స్టార్ చిరంజీవి ని కలిసిన పవన్ కళ్యాణ్..సంబరాల్లో ఫాన్స్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2W9NKmw
via IFTTT

No comments:
Post a Comment