నారింజ పండు సిట్రస్ జాతికి చెందిన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. మన తెలుగు దేశంలో నంద్యాల, కోడూరు, వడ్లమూడి మొదలగు ప్రాంతాలలో బాగా పండిస్తున్నారు. నారింజపండ్లు కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతిరీత్యా మార్పులు చెందుతూ వస్తున్నాయి. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. దీన్ని నిమ్మకన్నా కాస్త ఉత్తమం అంటారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది. అయితే నారింజ పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.
1. కంటిచూపును మెరుగపరుస్తుంది
2. చర్మసమస్యలను తగ్గిస్తుంది
3. రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖంగా విరోచనం అవుతుంది
4. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
5. ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది
6. నోటి దుర్వాసన,నోటిలో పుండ్లను రాకుండా అడ్డుకుంటుంది
7. సులభంగా ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది
The post ఇలాంటి నారింజ పండు వల్ల మనకి ఎంత లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Xx2yZV
No comments:
Post a Comment