etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, March 20, 2019

రూ.13 కోట్లు పెట్టి చేపను కొన్న మహిళ.. ఇంతకీ ఏముంది అందులో….?

చేప ధర మహా అయితే కిలో రూ. 200 ఉంటుంది.. మరీ ఎక్కువ అనుకుంటే రూ.500.. అబ్బో అంటే రూ.1000 ఉంటుందేమో.. కానీ ఎర్రని మచ్చలతో ఉన్న ఈ చేప ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఈ చేప ఖరీదు రూ.13 కోట్లు.. అవును మీరు నమ్మలేక పోయినా.. ఇది నిజం. దీని వెల అక్షరాలా రూ. 13 కోట్ల 54 లక్షల 4 వేల 3 వందల 40. మరీ ఈ చేప అంత ఖరీదు ఎందుకు ఉందో తెలుసా.. ఇది కొహాకు రకానికి చెందినది. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన రకాల్లో కొహా కూడా ఒకటి. ఈ రకం చేపలు 5 లక్షల వరకు గుడ్లు పెట్టగలవు. అయితే వీటిలో 5 వేల వరకే నాణ్యమైనవి ఉంటాయి.అందుకే దీనిని అంత ఖరీదు పెట్టి వేలంపాటలో దక్కించుకుంది తైవానుకు చెందిన మహిళ. యింగ్ యింగ్ అనే ఈ మహిళకు అరుదైన జాతులకు చెందిన, భిన్నంగా ఉండే చేపలను సేకరించడం హాబి.

జపాన్‌లోని హిరోషిమ నగరంలో ఈ చేపకు వేలంపాట నిర్వహిస్తున్నారని తెలుసుకున్న యింగ్ యింగ్ అక్కడికి చేరుకుని ఖర్చుకు వెనుకాడకుండా 3 అడుగుల 3 అంగుళాలు ఉన్న ఈ చేపను తన సొంతం చేసుకుంది. అంత ధర పెట్టి కొనడానికి ఇంతకీ ఏముంది అందులో.. పిచ్చి కాకపోతే.. అని చెవులు కొరుకుంటున్న వారు లేకపోలేదు. అయినా పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి.. అని ఉరికే అనలేదు పెద్దలు.. ఇందుకేనేమో అంటూ ఈ మహిళ చేసిన పని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

The post రూ.13 కోట్లు పెట్టి చేపను కొన్న మహిళ.. ఇంతకీ ఏముంది అందులో….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Fsavbn

No comments:

Post a Comment