రూ. వేయ్యిల నోట్ల స్థానంలో రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూ. 2వేల నోట్లను జారీ చేసింది. కళకళలాడుతున్న రూ.2వేల నోట్లు సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి కనిపించకుండా పోతున్నాయి. ఏ ఏటీఎంల్లో చూసినా వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తున్న రూ. 2వేల నోట్లు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముంగిట రూ.2వేల నోట్లు అదృశ్యం కావడంపై అంతు చిక్కడం లేదు. ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీనేతలు ఎన్నికల్లో అధికమొత్తం విలువగల నోటునే వినియోగిస్తుంటారు. ఎక్కడ చూసినా రూ. 500లు, రూ.200లు, రూ.100లు, రూ.50లు, రూ.10ల నోట్లే కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఎన్నికల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థుల వ్యయంకు సంబంధించి పెద్దనోట్లనే వినియోగిస్తుంటారు. కారణం వాటిని డ్రా చేయడం, ఇతరులకు అప్పగించడం వంటి సమస్యలు ఉంటాయి. ఎన్నికల వేళ పెద్ద నోట్లు అఙ్ఞాతంలోకి వెళ్లడంతో బ్యాంకుల్లోనూ రూ.2వేల నోట్లకు గిరాకీ ఏర్పడింది. మరి ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుందో వేచి చూడాలి.
The post రూ.2 వేల నోట్ల విషయంలో ఊహించని ట్విస్ట్ ! అదేంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FGf3K0
No comments:
Post a Comment