ప్రేమించినవాడు పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు తోడుగా ఉంటా డని భావించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ విద్యుత్నగర్లో నివాసముంటున్నారు. అనంతపురం నగరశివారులో ని సుశీలరెడ్డి కాలనీకి చెందిన సరోజ (28), రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన జగదీశ్వరరెడ్డి కొంతకాలంగా ప్రేమించుకుని 9 నెలల క్రితం పెళ్లిచేసుకున్నారు. వీరిమధ్య చిన్నచిన్న మనస్పర్థలు చోటుచేసుకుని తరచూ గొడవపడుతుంటే సరోజ తల్లిదండ్రులు సర్దిచెబుతూ వచ్చారని పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంలో కూడేరుకు వస్తుండగా కమ్మూరు దాటిన తరువాత ఓ వెంచర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ తగిలిందని పోలీసులకు జగదీశ్వరరెడ్డి చెప్పాడు.
ద్విచక్ర వాహనం నుంచి కిందపడ్డ కొద్దిసేపటికి జగదీశ్వరరెడ్డి భార్య తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్వల్పగాయాలైన జగదీశ్వరరెడ్డి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. ప్రమాదంలో తన భార్య చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసిన జగదీశ్వరరెడ్డి పోలీసులకు అనుమానం రావడంతో సంఘటన గురించి ఆరాతీశారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ నబీరసూల్ హత్యజరిగినట్లు గుర్తించారు. దీంతో జగదీశ్వరరెడ్డి నుంచి వాస్తవాలు రాబట్టారు. మృతురాలి తండ్రి ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ నబీరసూల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జగదీశ్వరరెడ్డి ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
The post తెల్లవారుజామున బైక్పై భార్యను ఎక్కించుకుని.. స్లోగా వెళ్తూ లారీని ఢీకొట్టి.. కిందపడగానే.. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2UI6Uz4
No comments:
Post a Comment