etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 3, 2019

BSNL ఉద్యోగులకు దిమ్మదిరిగే షాక్, అదేంటో తెలుసా ….?

54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాదు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాలకు తగ్గించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా.. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ.. తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. దీనికితోడు ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు చెల్లించడంతోపాటు మరో రూ.3500 కోట్ల రుణం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఇచ్చింది. ఈ డబ్బుతో మరో మూడు, నాలుగు నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించే వీలు కలిగింది. మరో రూ.700 కోట్లు కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

The post BSNL ఉద్యోగులకు దిమ్మదిరిగే షాక్, అదేంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TUif9V

No comments:

Post a Comment