etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 24, 2019

జనసేన పార్టీ దెబ్బ మా మీద మాములుగా పడలేదు – చంద్రబాబు నాయుడు

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా నిన్న తెలుగు దేశం పార్టీ తమ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దారుణంగా ఓడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 40 సంవత్సాలకు పైగా అనుభవం..పోల్ మానెజ్మెంట్ లో వందల కోట్ల రూపాయిలు వీచింది ఓట్లు కొనడం కోసం ఖర్చు చెయ్యడం..ఇలాంటివి ఎన్ని చేసిన కూడా ఆ పార్టీ కి 23 సీట్లు మాత్రమే వచ్చాయి..నిన్న చంద్రబాబు నాయుడు దారుణ పరాజయం తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..ఆయన మాట్లాడుతూ “ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలని మేము సమీక్షిస్తాము..ప్రజా తీర్పుని మేము స్వాగతిస్తున్నాము..సంపూర్ణ మెజారిటీ తో గెలిచినా జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను..మా ఓటమికి గల కారణాలను తెలుసుకొని ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళికలు వేస్తాము..పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వల్ల మా ఓట్లు అన్ని చీలిపోయాయి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది..” అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post జనసేన పార్టీ దెబ్బ మా మీద మాములుగా పడలేదు – చంద్రబాబు నాయుడు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2QkNXgs
via IFTTT

No comments:

Post a Comment