రాష్ట్రాభివృద్ధికి ఆయువుపట్టుగా ప్రజాసంక్షేమానికి పునాదిగా ప్రత్యేకహోదాని భావించి తమ ప్రాణాలకు తెగించి మొక్కవోని దీక్షతో ప్రత్యేకహోదా సాధనకై అలుపెరుగని పోరాటంతో శ్రమించి, ప్రజాఉద్యమాన్ని నిర్మించిన విద్యార్దులు, యువకులు , మేధావులపై చంద్రబాబుగారి అప్రజాస్వామికమైన విధానాలతో నియంతగామారి నియంతృత్వ ధోరణితో నిండిన ‘నారా’రూపరాక్షసపాలనలో నమోదుచేసిన కేసులు ఎత్తివేస్తూ శ్రీ వైఎస్ జగన్ గారి మంత్రివర్గం నిర్ణయం. మంత్రివర్గ సమావేశంలో భాగంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్ల రికవరీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి.
మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భూముల లీజు కూడా చెల్లించలేదని పరిశ్రమల శాఖ అధికారులు కేబినెట్కు వివరించారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
The post శ్రీ వైఎస్ జగన్ గారికి ఉద్యమ అభినందనలు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/34nUnlO
via IFTTT
No comments:
Post a Comment