కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఈరోజు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..ఈరోజు ఒక్క ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా మార్పు కోసం నిజాయితీగా పని చేసిన పవన్ కళ్యాణ్ కి ఇలాంటి ఫలితం రావడం ప్రత్యర్థులు కూడా జీర్ణించుకోలేక ఉన్నారు..ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దారుణం గా ఓడిపోగానే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మల్లి సినిమాల్లోకి వస్తున్నాడు అనే పుకార్లు జోరు అందుకున్నాయి..దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “నిజాయితీగా ప్రజల కోసం పోరాడాలి అనుకుంటే రాబందులు లాంటి అవినీతి రాజకీయ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అసత్య ప్రచారాలు చేసి మూడవ శక్తిని సమూలంగా తొక్కాలని చూస్తారు..గత కొంత కాల నుండి సోషల్ మీడియా లో నేను తిరిగి సినిమాల్లోకి వస్తున్నాను అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చాయి..నా అభిమానులకి మళ్ళీ నేను తెలియచేస్తున్నాను..నేను సినిమాలకు శాశ్వతంగా సెలవు ప్రకటించాను..నా జీవితం లో తుది శ్వాస వరుకు ప్రజల మధ్యనే బ్రతుకుతాను..రాబొయ్యే 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఎందుకు వైఫల్యం చెందిందో చర్చలు జరిగి..మా పొరపాట్లను సరిదిద్దుకొని ,2024 లో బలంగా ప్రజా తీర్పు పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తాను..జనసైనికులు నా ఈ సుదీర్ఘ పోరాటం లో నిలబడినందుకు కృతఙ్ఞతలు తెలిచేస్తున్నాను..” అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JZ4WUu
via IFTTT

No comments:
Post a Comment