కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా భీమవరం లో పవన్ కళ్యాణ్ ఓటమి పట్ల చాల కుట్రలు జరిగాయి అని..రీ పోలింగ్ పెట్టాల్సిందే అని ,లేకపోతే ఈ నెల 27 వ తారీఖున భీమవరం లో పెద్ద ఎత్తున మహా ధర్నా చేపడుతాము అని పవన్ కళ్యాణ్ అభిమానులు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..దీని గురించి జనసేన పార్టీ అభిమానులకు అధికారికంగా ఒక్క ప్ఫరకటన విడుదల చేసింది..”ఆందోళన వద్దు…భీమవరం నియోజకవర్గంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన జన సైనికుల్లో నెలకొంది. మన పార్టీ తరఫున వెళ్ళిన కౌంటింగ్ ఏజెంట్ పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు సమానంగా ఉన్నాయని ధృవీకరించుకున్నారు. కావున మన జన సైనికులెవరూ ఈ విషయంపై ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేపట్టవద్దు..” అంటూ అభిమానులకి జనసేన పార్టీ తరుపున అధికారిక ప్రకటన వెలువడింది..కావున ఎవ్వరు దీని గురించి అందలోనా చెందాల్సిన అవసరం లేదు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post Breaking News: భీమవరం లో రీ- పోలింగ్ పై కలకలం రేపుతున్న పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్..షాక్ లో ఫాన్స్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JGJT9J
via IFTTT

No comments:
Post a Comment