ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ నుండి నేతలు వలసబాట పట్టారు. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అంటున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వంగవీటి రాధా.. ఇప్పుడు జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారు. పవన్కల్యాణ్తో టీడీపీ నాయకుడు వంగవీటి రాధా భేటీ అయ్యారు.గంటకు పైగా వీరిద్దరి సమావేశం జరిగింది, పార్టీలోకి చేరాలని పవన్ కోరారు అని సమాచారం. ఎన్నికల ముందే వంగవీటి రాధా జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆయన టీడీపీలో చేరారు. అక్కడ ఆయనకు పార్టీ టికెట్ కేటాయించలేదు. టీడీపీలో చేరిన వంగవీటి రాధా స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు.
వంగవీటి రాధా వైసీపీ లో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ జగన్ అధినేత తీరుతో పార్టీ మారి టీడీపీలో చేరారు. దీనిపై ఇప్పుడు విజయవాడ లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.
The post జనసేనలో చేరబోతున్న వంగవీటి.. పవన్ కల్యాణ్ భేటీ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JgK09J
via IFTTT
No comments:
Post a Comment