వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి యత్నించి.. హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రవీణ్ అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. కొద్దిసేపటికి మేల్కొన్న పాప తల్లిదండ్రులు చిన్నారి కనిపించకపోయే సరికి కంగారు పడ్డారు. చుట్టుపక్కల ఆచూకీ కోసం చూడగా ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యం కంట పడింది. అప్పటికే చిన్నారి అస్వస్థతకు లోనైంది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని మ్యాక్స్కేర్ హాస్పిటల్కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ప్రవీణ్ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.
అయితే తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. ప్రవీణ్కు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. వరంగల్కు చెందిన పసిపాపపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. 48 రోజుల క్రితం హన్మకొండ రెడ్డి కాలనీలో ఇంటి డాబా మీద తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అయితే ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
The post కామాంధుడికి సరైన శిక్ష వేసిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YAmy1y
No comments:
Post a Comment