etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 1, 2019

మార్కెట్లోకి మరో కొత్త బైక్.. రూ.6 ఛార్జింగ్‌తో 120 కి.మీ..త్వరపడండి.

పొల్యూషన్‌కి చెక్ పెట్టే నిమిత్తం మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయి. ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన బైక్ మార్కెట్లోకి త్వరలో రాబోతోంది. ఒకసారి చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఇందుకోసం రెండు యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్, ముంబై ఐఐటీకి చెందిన రోహిత్ కలిసి 2016లో ఏర్పాటు చేసిన ప్యూర్ ఈవీ బైక్‌లను తీసుకువస్తుంది. సంగారెడ్డి జిల్లా కందిమండలంలో ఏర్పాటు చేసుకున్న రీసెర్చ్ సెంటర్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడం ద్వారా ఈ బైక్‌లకు కావలసిన ప్రధాన శక్తిని అందించింది. 45 కిలోలో మాత్రమే బరువున్న ఈ బైక్‌లకు ఈ-ట్రాన్స్ అని పేరు పెట్టారు. ఇక ఎంచుకునే మోడల్‌ని బట్టి ధర ఉండనుంది. రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వుండొచ్చని అంచనా. మార్చి 2020లోగా మార్కెట్లోకి ఈబైక్‌లను ప్రవేశపెడతారు. నాలుగ్గంటలపాటు ఫుల్ ఛార్జింగ్‌పెట్టుకుని బైక్‌పై హ్యాపీగా తిరిగేయొచ్చు.

The post మార్కెట్లోకి మరో కొత్త బైక్.. రూ.6 ఛార్జింగ్‌తో 120 కి.మీ..త్వరపడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2vx4jJi

No comments:

Post a Comment