etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, July 24, 2019

పయ్యావుల కేశవ్ కి పదవి ఇవ్వటం తో టీడీపీ లో అసంతృప్తి

టీడీపీ లో ఎప్పుడు కొత్త ముసలం ఏర్పడింది, PAC చైర్మన్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దింతో పార్టీలో వున్నా సీనియర్ నాయకులతో సహా దీనిపై గుర్రుగా వున్నారని సమాచారం. చంద్రబాబు నిర్ణయంపై అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. బుధవారం అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది.

ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కేశవ్, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, గణబాబు తదితరులు ఈ పదవి ఆశించినా చంద్రబాబు కేశవ్ పైనే మొగ్గు చూపారు. ఈ పదవికి ముందు గంటా ను కూడా తీసుకునే అవకాశం వున్నా ఇటీవల అయన పార్టీ మారతారు అనే ప్రచారం జోరుగా ఉండటం తో ఈ పదవిని కేశవ్ కు కేటాయించారు.

The post పయ్యావుల కేశవ్ కి పదవి ఇవ్వటం తో టీడీపీ లో అసంతృప్తి appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2YhikGQ
via IFTTT

No comments:

Post a Comment