మండపేటలో కిడ్నప్ అయిన బాలుడు జషిత్ దొరికేసాడు..కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున వదిలి వెళ్లిన దుండగులు. గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్లో జషిత్ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. అతడిని గమనించిన స్థానిక కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా నాలుగురోజుల క్రితం జషిత్ను మండపేటలో కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మండపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన బాలుడు జషిత్ క్షేమంగా తిరిగొచ్చాడు. జషిత్ను పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
గురువారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు రోడ్లో జషిత్ను కిడ్నాపర్లు వదిలివెళ్లడంతో పోలీసులు క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ నయీం స్వయంగా జషిత్ను ఎత్తుకుని తీసుకొచ్చి బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడు సురక్షితంగా తిరిగిరావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు జషిత్ను తల్లి నాగావళి ఆప్యాయంగా హత్తుకున్నారు.
The post అమ్మ ఒడికి చేరిన బుడత జషిత్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2MdZiiy
via IFTTT
No comments:
Post a Comment